ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వీర సింహారెడ్డి టీమ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో పాల్గొన్నారు. శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే గతంలో అఖండ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు అన్ స్టాపబుల్ లో జరిగాయి. కట్ చేస్తే అఖండ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అన్స్టాపబుల్ వేదికగా వీర సింహారెడ్డిని కూడా ప్రమోట్ చేయబోతున్నారు. అఖండ సెంటిమెంట్ రిపీట్ అయితే.. వీర సింహారెడ్డి రూపంతో బాలయ్యకు బంపర్ హిట్ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.