ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా బాలయ్య వీర బాదుడు బాదుతున్నాడు. పండగ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.
విడుదలైన 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకున్న ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ. 8.15 కోట్ల రేంజ్లో వసూళ్లను రాబట్టింది. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి రూ.52.65 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకుంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 21.35 కోట్ల షేర్ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా వీర సింహారెడ్డి ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ను గమనిస్తే..
నైజాం: 12.10 కోట్లు
సీడెడ్: 11.96 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.40 కోట్లు
తూర్పు: 3.34 కోట్లు
పశ్చిమ: 2.87 కోట్లు
గుంటూరు: 4.75 కోట్లు
కృష్ణ: 2.96 కోట్లు
నెల్లూరు: 1.92 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ=44.30 కోట్లు(71.35కోట్లు~ గ్రాస్)
—————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 3.55 కోట్లు
ఓవర్సీస్: 4.80కోట్లు
—————————————-
వరల్డ్ వైడ్= 52.65 కోట్లు(88.15 కోట్లు~ గ్రాస్)
—————————————-