ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు.
అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి, జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అయితే ఈ రెండు సినిమాలు స్టోరీ ఒకటే. అవును ఈ రెండు సినిమాలు రివేంజ్ స్టోరీలతో తెరకెక్కినవే. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి రవితేజ ప్రత్యర్థులుగా కనిపించబోతున్నారని అంటున్నారు. ఇక వీర సింహారెడ్డిలో బాలయ్య తండ్రి కొడుకులుగా రెండు పాత్రలను పోషించాడు. అయితే తండ్రి మరణానికి కారణమైన వారిపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మొత్తానికి రివేంజ్ స్టోరీ లతో వస్తున్న ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయి అన్నది చూడాల్సి ఉంది.