టాలీవుడ్ హీరో వెంకట్ మీకు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?

టాలీవుడ్ హీరో వెంకట్ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదే పేరుతో మరొక నటుడు టాలీవుడ్లో సినిమాలు చేసాడని మీకు ఎంతమందికి తెలుసు? బేసిగ్గా చలన చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతోమంది ఔత్సాహిక హీరోలు మనకు తెరపై కనిపిస్తూ వుంటారు. ఈ రంగురంగుల ప్రపంచంలోకి చాలామంది నటులు వస్తూ వుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే క్లిక్ అవుతారు. మరి కొంతమంది హీరోలు తమ సినిమా కెరీర్ ని సగంలోనే ముగిస్తారు.

ఇక ఆ తరువాత వారు కనబడనే కనబడరు. ఎక్కడ వుంటారో కూడా తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే వారి ఉనికి కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటివాళ్లలో నటుడు వెంకట్ ఒకరు. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ‘ఆనందం’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన వెంకట్ ని తెలుగు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయే వుంటారు. తెలుగులో దాదాపు 15 పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో ఇతగాడు నటించాడు. కానీ కథల ఎంపిక విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే వెంకట్ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి అనే రూమర్ వుంది.

దాంతో సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోలేక బయటకి వెళ్ళిపోయాడు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నటించినటువంటి చిత్రాలలో ఎక్కువ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు కాబట్టే తాను హీరోగా రాణించలేకపోయాను అని నిజాయితీగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం వెంకట్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నాడు. ఇకపోతే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, జగపతిబాబు , నందమూరి బాలకృష్ణ తదితర హీరోలతో కలిసి వెంకట్ నటించిన సంగతి విదితమే.