బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్: హౌస్ లోకి అమర్ దీప్ దంపతులు?

బిగ్ బాస్ అనగానే మన తెలుగు ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉండిపోతారు. ఒకప్పుడు ఎక్కడో ఖండాంతరాలు దాటి విదేశాలకు పరిమితమైన ఈ షో ఇపుడు మన నట్టింట్లోకి కూడా వచ్చేసింది. ఇపుడు తెలుగు బుల్లితెరపైన బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఇటీవలే ఎంతో ఘనంగా ముగిసిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం సీజన్ 7 గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

కాగా సీజన్ సిక్స్ కన్నా సీజన్ సెవెన్ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్ సీజన్ 7లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో గత కొన్ని సీజన్ల నుంచి సెలబ్రిటీ కపుల్స్ ను పంపించడం జరుగుతుంది. అందుకే ఇపుడు సీజన్ సెవెన్ లో కూడా మరొక జంటను హౌస్ లోకి పంపించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు భోగట్టా.

కాగా బుల్లితెర నటీనటులుగా ఈపాటికే ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అమర్ దీప్, తేజస్విని గౌడ దంపతులు ఈ సీజన్ లో హౌస్ లో మెరవబోతున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ వార్తలపై నటుడు అమర్ దీప్ పలు వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ లోపాల్గొనే అవకాశం వస్తే నిజంగానే మీరు వెళ్తారా? అని ప్రశ్నకు సమాధానంగా ఏమో చూద్దాం అంటూ నాన్చుతూ సమాధానం చెప్పారు. తన భార్య తేజస్విని గురించి అడగగా ప్రస్తుతం తేజు జి తమిళ సీరియల్స్ లో నటిస్తోంది. అలాగే ఇక్కడ మన తెలుగులో కూడా నటిస్తోంది. చూడాలి మరి భవిష్యత్ ఎలా ఉంటుందో…. దేనికైనా అదృష్టం ఉండాలి కదా అని తన మనసులోని కోరికను చెప్పకనే చెప్పాడు.