ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా చిరు, బాలయ్య పై శృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ ఎనర్జీ తో ఉంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతత, సున్నితంగా ఉంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది.
తన కెరీర్ లో ఒకే సారి రెండు సినిమాలు రావడం రెండోసారి అని, ఏడేళ్ళ క్రితం తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయని, మళ్లీ ఇన్నేళ్లకు సీన్ రిపీట్ అయిందని శ్రుతి హాసన్ పేర్కొంది. ఇక వీరసింహా రెడ్డిలో తన పాత్ర ఫన్ ఫుల్ గా ఉంటుందని, వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్ అని.. అయితే రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవని ఆమె తెలిపింది. దీంతో శ్రుతి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.