మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు.
ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతూ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్, పూనకాలు లోడింగ్ పాటులు బయటకు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.
ముఖ్యంగా చిరు, శ్రుతిలపై చిత్రీకరించిన `నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవి` సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే చిరుతో ఈ సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానంటూ శ్రుతి హాసన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. మంచు కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో ఈ సాంగ్ ను షూట్ చేశారు. అయితే ఈ పాటలో ఎక్కవ శాతం సారీలోనే కనిపించిన శ్రుతిహాసన్.. దాని కారణంగా ఇబ్బందిపడ్డానని తెలిపింది. చీర వల్ల ఫిజికల్ గా చాలా అసౌకర్యానికి గురైందట. అయితే ఫ్యాన్స్ కోసమే ఈ పాటలో చీరలో కనిపించానని శ్రుతి తెలిపింది.