గీత గోవిందం సినిమాతో హిట్ పైర్ గా పేరు పేరుపొందారు విజయ్ దేవరకొండ, రష్మిక .ఇందులో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయిందని చూడముచ్చటగా ఉందని ఎంతోమంది అభిమానులు తెలియజేయడం జరిగింది. ఇక అదే ఊపులోని వీరు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేయగ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి. అదికాక ఎప్పుడు అడిగినా కూడా మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ తెలియజేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు పలుటూర్లకు వెకేషన్కు వెళుతూ ఉన్నట్లు సమాచారం.
రష్మిక, విజయ్ దేవరకొండ తెరపై మరొకసారి జంటగా చూడాలని అభిమానులు చాలాకాలంగా కోరుకుంటున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి రష్మిక తెలియజేస్తూ.. సరైన కథ దొరికితే కచ్చితంగా చేస్తామంటూ తెలియజేస్తోంది. అయితే తాను నటించిన వారసుడు, మిషన్ మజ్ను సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన రష్మి విజయ్తో నెక్స్ట్ మూవీ గురించి హింట్ ఇవ్వడం జరిగింది. రష్మిక ప్రజెంట్ విజయ్ తో ఎలాంటి సినిమా చేయలేదు కానీ ఈ ఏడాది లేకపోతే వచ్చే తప్పకుండా తనతో నటిస్తానంటూ తెలియజేస్తోంది.
తామిద్దరిని కలిపి తెరపై చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు..అందుచేతనే స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా ఈ ఏడాది మీకు గుడ్ న్యూస్ చెబుతామంటూ తెలియజేస్తోంది. దీంతో అటు రష్మిక, విజయ్ దేవరకొండ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరొకసారి ఈ జంట స్క్రీన్ పైన సందడి చేయబోతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.