టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చిన క్రేజ్ తో తన ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నాడు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ గా ఉండబోతుందని నిర్మాతలకు భారీ లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లో వస్తున్నాయి.
ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగాలనే ఆలోచనతో తన భార్య ఉపాసన- చరణ్ కు ఎంతో స్పెషల్గా ఓ పిఆర్ టీమ్ను నియమించింది అని సమాచారం. ఈ నిర్ణయంతో చరణ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ నెలలోనే 12 రోజులు పాటు శంకర్ సినిమాలో చరణ్ నటించబోతున్నాడు. మరోవైపు ఉప్పె ఫేం సానా బుచ్చిబాబు సినిమాను కూడా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడని కూడా తెలుస్తుంది.
చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుందని తెలుస్తుంది. చిరంజీవి- రామ్ చరణ్ కాంబోలో కూడా రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశం కూడా ఉంది. చిరంజీవి సైతం ఎంతో వేగంగా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
గత సంవత్సరం చిరంజీవి నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాగా..ఈ సంవత్సరం కూడా మెగాస్టార్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. రామ్ చరణ్ కూడా నటనకు ప్రాధాన్యత ఉన్నా సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో విజయం సొంతం చేసుకుంటే మాత్రం చరణ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.