ఏడుస్తున్న తప్పదుగా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన ఇంటి దగ్గర నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. గత కొద్దిరోజులుగా సమంత ఆరోగ్యం కాస్త కుదట పడినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా ఈమె ముంబై ఎయిర్ పోర్టులో కూడా మెరిసింది. ఇక అంతే కాకుండా ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొంటుంది.

టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా శాకుంతలం పాత్రలో నటించడానికి తాను పడిన కష్టాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో సుమంత జిమ్లో వర్కౌట్ చేస్తూ శాకుంతలం సినిమాకి సంబంధించిన భంగిమలు అనుసరిస్తూ ఫోటోకు ఫోజులిచ్చింది.

శాకుంతలం సినిమా బంగిమలు ఎలా ఉన్నా కొనసాగించాలంటూ చెప్పుకొచ్చింది. “శాకుంతలం సినిమాలో ఎంతో కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు.. మాట్లాడుతున్నప్పుడు.. ఏడుస్తున్నప్పుడు కూడా దయ.. భంగిమను కొనసాగించడం. దయ అనేది నా విషయం కాదు. అందుకు సాషాను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది. “అంటూ శాకుంతలం భంగిమను షేర్ చేసింది.

సాషాకు సంబంధించిన విషయాలు మాత్రమే సమంతను నవ్వించగలవు అట‌.. అయితే సమంత లుక్ చాలా డల్ గా అనిపించింది. పైగా కాస్త సన్నబడినట్లు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా సమంత రూపం మాత్రం మునిపటిలాగా లేదు అంటూ ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం స‌మంత‌.. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఖుషి సినిమాలోనూ నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)