పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా విడుదలను ఈ ఏడాది సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు ముచ్చటపడుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ చిత్రానికి రూ. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని భావించారు. కానీ, ఫైనల్ గా ఎంత బడ్జెట్ అయిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, రూ. 250 అనుకుంటే.. చివరకు రూ. 400 కోట్లకు చేరిందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. అయినాసరే మేకర్స్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని అంటున్నారు. మరి ఇంత హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూడాలి.