మిషన్ మజ్ను.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్రమిది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్షర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జవనరి 20న నేరుగా విడుదల అయింది. రహస్యంగా పాకిస్థాన్ చేస్తోన్న అణ్వాయుధ పరీక్షల స్థావరాన్ని కొనుగొనే ఓ స్ఫై కథ ఇది. అయితే ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందీ చిత్రం.
ఇకపోతే ఈ మూవీకి రష్మిక పుచ్చుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిషన్ మజ్ను మూవీలో నస్రీన్ అనే అంధురాలు పాత్రలో నటించింది. అందుకు గానూ రష్మిక ఏకంగా రూ. 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుందట. ఏదేమైనా తొలి సినిమాకే బాలీవుడ్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక బాలీవుడ్ లో రష్మిక రణబీర్ కపూర్ కు జోడీగా `యానిమల్` అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఇక తెలుగులో అల్లు అర్జున్ తో `పుష్ప 2` చేస్తోంది.