ప్ర‌భాస్-మారుతి మూవీ విడుద‌లకు ముహూర్తం పెట్టేశారోచ్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్ప‌టికే షూటింగ్ లోకేష‌న్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. కానీ, ఇంత వ‌ర‌కు ఈ మూవీపై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ ఇవ్వ‌లేదు. సైలెంట్ గా మారుతి షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. హార‌ర్ కామెడీ క‌థాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్న‌ట్లు టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ విడుద‌లు మేక‌ర్స్ ముహూర్తం పెట్టేశార‌ట‌.

ఈ ఏడాది ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ డేట్ తో స‌హా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.. మూడో షెడ్యూల్ ఈ నెల ఆఖ‌రి వారం నుంచి స్టార్ట్ చేయ‌బోతున్నారు. మూడో షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్ కూడా పాల్గొననుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ ను సైతం ప్లాన్ చేశారని స‌మాచారం.