పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఏ మూవీకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాడు.. ఏ దర్శకుడుతో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడో తెలియక తలలు పీక్కుంటున్నారు పవన్ అభిమానులు.. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. ఇదే సమయంలో హరిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ంగ్ కి పవన్ రెడీ అయ్యాడు.. ఆ తర్వాత ఈ సినిమా గురించి హడావుడి ఏం లేదు.
ఇక ఇప్పుడు కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వినోదియ సిత్తం’ సెట్స్ మీదకి వెళ్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హరిష్ శంకర్ సినిమా కంటే ముందే మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. రన్ రాజా రన్, సాహో సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుజిత్, పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ను ఈ నెలలో ప్రారంభించబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్లో ఓ వార్త వైరల్ గా మారింది.
ఈ నెల 30వ తారీఖున ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని తాజాగా అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాను త్రిబుల్ ఆర్ ఇలాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలు నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సాహో సినిమా తర్వాత సుజిత్ తెరకెక్కించబోయే సినిమా కూడా ఇదే. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానైనా సుజిత్ తీయబోయే ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని పవన్ ఎప్పుడు మొదలుపెడతాడు.. ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎప్పుడు పూర్తి చేస్తాడు.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మంచి ముహూర్తం ఉందని ముందు ఆ వేడుక పూర్తి చేయబోతున్నారు. పవన్కు ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లోపు అయితే ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు.