అందుకు ససేమీర అన్న చిరు-బాలయ్య‌.. ఫ‌లించ‌ని మైత్రీ మంత‌నాలు!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.

ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో రూపుదిద్దుకున్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల అవుతుండడంతో సార్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించింది కనుక చిరంజీవి మరియు బాలయ్యలను ఒకే వేదిక వైకి తీసుకువచ్చి ఓ ప్రమోషనల్ ఇంట‌ర్వ్యూను నిర్వహించాలని మైత్రీ వారు భావించారట.

ఈ నేపథ్యంలోనే బాలయ్య, చిరులతో మంతనాలు కూడా జరిపారు. కానీ వారి మంతనాలు ఫలించలేదని తెలుస్తోంది. బాలయ్య చిరు అందుకు స‌సేమీరా అన్నారని.. వీరిద్దరి కాంబినేషన్లో ఇంటర్వ్యూ లేనట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.