తెలుగు సినీ దర్శకులలో డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈయన చంద్రలేఖ సినిమా సమయంలో హీరోయిన్ రమ్యకృష్ణతో ప్రేమలో పడి ఆ ప్రేమను వివాహ బంధం వైపు తీసుకువెళ్లారు. అలా కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
డైరెక్టర్ కృష్ణవంశీ మాత్రం తన హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రంగమార్తాండ సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా మొదలుపెట్టారు. ఇందులో రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు నటించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఆయనకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా అనుకున్న దానికంటే అధిక బడ్జెట్ అవుతోందని అయితే రమ్యకృష్ణ తాను బడ్జెట్ కంట్రోల్ చేశానని తెలియజేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మరొకసారి రమ్యకృష్ణ కృష్ణవంశీల విడాకుల వార్త చర్చనీ అంశంగా మారింది.
ప్రస్తుతం తామిద్దరం సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాము. దీంతో రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది తాను హైదరాబాదులో ఉన్నానని తెలిపారు. వృత్తిపరంగా మేము విడిగా ఉన్నామే తప్ప విడాకులు తీసుకోలేదు అంటూ ఒక స్పష్టతనిచ్చారు. ఇలాంటి వార్తలు సృష్టించిన వారి శాడిజం చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారని కూడా అనిపిస్తుందని కృష్ణవంశీ తెలిపారు. విడాకుల విషయంలో ఎలాంటి నిజం లేదని మరొకసారి క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ.