వాల్తేరు వీరయ్య విషయంలో వారి మధ్య తీవ్ర గొడవలు.. ఎందుకంటే..

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ టైమ్‌ దగ్గరవుతున్న కొద్దీ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయాడు. అలానే ఇతర మీడియాల ద్వారా అభిమానులతో ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరు తన ప్రియ సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ… “ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతనిని ప్రతిపక్ష పార్టీ నేతలు దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలు విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. పవన్ నాకు బిడ్డ లాంటివాడు. అతనికి మా కుటుంబం అంటే చాలా ప్రేమ. మొన్నటివరకు పవన్ కి సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాలను మంచి మార్గంలో తీసుకెళ్లలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల వైపు వెళ్ళాడు. కానీ కొంతమంది పవన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. పవన్ ని విమర్శించిన వారితో ఎపుడైనా మాట్లాడాల్సి వచ్చినపుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది” అని ఆయన మనసులో మాట అందరితో పంచుకున్నాడు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. అంతా సర్దుకుపోయి ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అలానే అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావచ్చు. అయితే బాలకృష్ణ సినిమా కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వేళ అభిమానుల మధ్య పెద్ద వార్‌ నడుస్తోంది. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అంటూ అభిమానులు గొడవ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్‌కి చెందిన నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ‘డల్లాస్‌లో కావొచ్చు.. ఇంకెక్కడైనా కావొచ్చు.. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడొద్దని నా విజ్ఞప్తి. ఎవరికివారు తమ హీరో సినిమాని ఎంజాయ్ చేయండి.. వీర సింహా రెడ్డి.. వాల్తేరు వీరయ్య.. ఈ రెండూ హిట్లే అవుతాయి..’ అని అన్నారు.