సెలబ్రిటీలు, పొలిటిషన్లు నిత్యం ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు. వారు తమ కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం కూడా చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు అదే పనిలో ఉన్నారు ఓ స్టార్ కపుల్..పైన ఫోటోలో కూతురుతో కలిసి బుడిబుడి అడుగులు వేయిస్తున్న ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలోనూ ఎంతో క్రేజ్ ఉంది. వీరు సామాజిక మాధ్యమాల్లో ఒక చిన్న పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాల్లో అది తెగ వైరల్ గా మారుతుంది.
వారి కూతురు కూడా అంతే ఫేమస్. అయితే ఇప్పటివరకు తన ఫేమస్ ప్రపంచానికి చూపించకపోయినా స్టార్ కిడ్గా ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఈ లవ్లీకపుల్ దుబాయ్ కు వెకేషన్ కు వెళ్లారు..న్యూ ఇయర్ వేడుకలను కూడా అక్కడే ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు ఈ జంట.. తర్వాత ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో ఎంతో వైరల్ గా మారాయి.
ఇంతకీ పై ఫోటోలో కూతురు అడుగులలో కలిసి అడుగులు వేస్తున్న ఈ లవ్లీ జంట మరి ఎవరో కాదు.. ఇండియన్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్ వెళ్లిన ఈ జంట అక్కడే కొత్త సంవత్సర వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమ గారాల పట్టి వామికతో కలిసి బీచ్ లో సరదాగా గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా కోహ్లీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
ఆ పోస్టుకు.. ‘దేవుడా.. ఇప్పటి వరకు మమ్మల్ని ఆశీర్వదించావు. ఇతర కోరికలేమీ లేవు. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం అంతే’ అని కామెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ కు క్యూట్ ఫ్యామిలీ లవ్లీ కపుల్ అంటూ అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు
View this post on Instagram