ర‌వితేజ‌కు ల‌వ‌ర్‌గా, భార్య‌గా, త‌ల్లిగా న‌టించిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొన‌సాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్క‌సారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వ‌దిన‌, అక్క, చెల్లి, త‌ల్లి వంటి స‌హాయక పాత్ర‌ల‌కు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోల‌కు జోడీగా న‌టించ‌న‌వారే.. కొన్నాళ్ల‌కు త‌ల్లిగా, చెల్లిగా న‌టిస్తుంటారు. అలా మాస్ మ‌హారాజా ర‌వితేజకు ల‌వ‌ర్ గా భార్య‌గా, త‌ల్లిగా న‌టించిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. శ్రుతి హాస‌న్‌.

అవును, బలుపు సినిమాలో ర‌వితేజ‌కు ల‌వ‌ర్ గా శ్రుతి మాస‌న్ న‌టించింది. 2013లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `క్రాక్` సినిమాలో ర‌వితేజ‌కు భార్య న‌టించింది. 2021లో వ‌చ్చిన ఈ సినిమా సైతం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

 

ఇక ఇప్పుడు `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ‌కు శ్రుతి హాస‌న్ త‌ల్లిగా కనిపించోబోతంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో చిరంజీవి, ర‌వితేజ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించింది. అంటే శ్రుతి హాసన్.. ర‌వితేజ వదిన కాబోతోందన్నమాట. ఇక వ‌దిన అంటే అమ్మ‌తో స‌మాన‌మే క‌దా. మొత్తానికి అలా ఒక హీరోకు ల‌వ‌ర్‌గా, భార్య‌గా, త‌ల్లిగా న‌టించిన అతి త‌క్కువ మంది హీరోయిన్ల జాబితాలో శ్రుతి కూడా చేరింది.