బాలకృష్ణపై చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. ఆపవయ్యా నీ సుత్తి అంటూ??

ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఆ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీ మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఇక చిరంజీవి ఒకవైపు ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే ఇంకోవైపు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్య గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా మా నాన్న చిరంజీవి, ఆయన చాలా గొప్పవాడు, ఆయనని మించిన గొప్పవారు లేరు అంటూ ప్రతిసారి నా గురించి ప్రస్తావించాడు. అలా ఊరికే గొప్పలు చెప్పుకుంటూ, ప్రతిసారి తండ్రి ప్రస్తావన తీసుకొస్తుంటే జనాలకి చిరాకు పుట్టి ఏంటి నీ గోల అని తిట్టుకుంటారాంటూ కామెంట్స్ చేశారు.

ఇదంతా చూస్తే అప్పట్లో బాలకృష్ణ ఎక్కడికి వెళ్లిన మాట్లాడే ముందు ఆ రోజుల్లో మా నాన్న గారు అని ప్రస్తావించేవాడు. ఇక మా కంటే ఎవరూ గొప్పవాలు లేరని బాలయ్య చెప్పడం గుర్తుకు వస్తుంది. దీంతో చిరంజీవి బాలకృష్ణనే ప్రత్యక్షంగా ఎగతాళి చేసినట్లు తెలుస్తోంది. అందుకే చిరంజీవి కామెంట్స్ విన్న తరువాత బాలయ్య అభిమానులు వాటిని తిప్పికొడుతున్నారు. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతి హాసన్ రాలేదు. అయితే ‘ఆమెకి సడన్ గా ఆరోగ్యం బాలేదంట, నేను నమ్మను. ఎవరైనా ఆమెని బెదిరించి ఉంటారేమో’ అని మళ్ళీ బాలయ్యని ఉద్దేశించి చిరు వ్యాఖ్యలు చేసారు.