ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. ముందుగా వారిలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ఈ బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు. ఈ సినిమా విడుదలైన 24గంటల తర్వాత చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రెండు సినిమాలలో ముందు నుంచి బాలకృష్ణ తన హవా చూపుస్తు సూపర్ జోష్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న వీరసింహరెడ్డి సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని ఇప్పటికే టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఓవర్సీస్ మార్కెట్ లో కూడా బాలయ్య తన మాస్ హవా తన గత సినిమాల్లో ఏది చూపని విధంగా చూపిస్తున్నారు. ఒక యుఎస్ మార్కెట్ లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అన్నిచోట్ల కూడా ప్రీ బుకింగ్స్ లో వీర సింహారెడ్డి సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తు టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ఇక దీంతో ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం బాలయ్య ఈ సంక్రాంతికి తన హావా చూపిస్తున్నాడు. ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.