గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న త్రిష‌.. కొత్త ఇల్లు కొన్న‌ది ఎవ‌రి కోస‌మో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో విజయ్‌ దళపతి ఇంటి స‌మీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింద‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత సుంద‌ర‌గా ఈ ఇల్లు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే కొత్త ఇల్లు కొన‌డం వెన‌క ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. వ‌రుడికి సంబంధించిన వివ‌రాలు ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. కానీ, త‌న‌కు కాబోయే భ‌ర్త కోస‌మే ఈ కొత్త ఇంటిని ఆమె కొనుగోలు చేసింద‌ట‌. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో ఈ కొత్త ఇంట్లోనే కాపురం పెట్ట‌బోతోంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వ‌ర‌లోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్ప‌నుంద‌ని కూడా అంటున్నారు.

కాగా, 2015లో వరుణ్ మణియన్ అనే వ్యక్తితో త్రిష నిశ్చితార్థం జరిగింది. వరుణ్ మణియన్ చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత‌. అయితే ఎంగేజ్ మెంట్ జరిగిన కొద్ది రోజులకే వరుణ్ మణియన్ తో త్రిష బ్రేకప్ జరిగింది. ఇక సినిమాల విష‌యానికి వస్తే.. `పొన్నియిన్ సెల్వ‌న్ 1` తో మంచి కంబ్యాక్ ఇచ్చిన త్రిష‌.. ప్ర‌స్తుతం `పొన్నియిన్ సెల్వ‌న్ 2`లో న‌టిస్తోంది. అలాగే విజ‌య్ ద‌ళ‌ప‌తి, అజిత్ సినిమాల‌కు సైన్ చేసింద‌ని అంటున్నారు.