స్టార్ హీరో చిత్రాల పైన కరోనా ఎఫెక్ట్ పడనుందా..!!

గతంలో కరోనా వలన ఇండస్ట్రీకే కాకుండా యావత్ ప్రపంచనికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మనందరికీ తెలిసిందే .. థియేటర్లను బంద్ చేసి నష్టాన్ని మిగిలించింది . ఈ ఏడాది 2022 సంక్రాంతి సమయంలో పోటా పోటీ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్న టైంలో థర్డ్ వేవ్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కూడా అదే 2023 లో సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాలకు ఏమైనా కరోనా ఎఫెక్ట్ ఉంటుందా? అనే కొన్ని ప్రశ్నలు అభిమానులలో తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం కరోనా ఎక్కువగా విజృంభిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Chiranjeevi Vs Balakrishna: వాల్తేరు వీరయ్య Vs వీరసింహా రెడ్డి.. సంక్రాంతి  బరిలో మరోసారి చిరు, బాలయ్య ఢీ.. | Chiranjeevi Vs Balakrishna once again  chiru waltair veerayya balayya veera simha ...

కేంద్ర ప్రభుత్వాలు నుంచి మాస్క్ ధరించాలని అలాగే భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అయితే కరోనా కేసులు అధిక సంఖ్యలో రాలేదని జిఎఫ్ 7 వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అయితే ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదని ఈ సినిమాలు కరోనాను అధికమించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

ఈ రెండు సినిమాల బడ్జెట్ 300 కోట్లు రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెలకుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ఒకే ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతాయి.ఈ సినిమా ట్రైలర్ జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో అలాగే బాలయ్య ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు ఈ రెండు చిత్రాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.