RRR సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేసిన రాజమౌళి..!!

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలలో RRR సినిమా కూడా ఒకటి.దాదాపుగా ఈ చిత్రం రూ.1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా రాజమౌళి నుంచి ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది అన్నట్లుగా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కథ కూడా సిద్ధం చేస్తున్నారని ఒక పాపులర్ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూలో రాజమౌళి తెలియజేసినట్లు సమాచారం.

RRR 2 story is locked; Writer Vijayendra Prasad drops an exciting UPDATE on SS Rajamouli's film | PINKVILLA
జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో సీక్వెల్ ను రాజమౌళి తెరకెక్కించబోతున్నట్లు అంగీకరించారు. మేము దీనిపైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. బ్రిటిష్ వారిపై వీరుల యుద్ధం కొనసాగుతుందని కూడా ఒక వెరైటీ కథనంతో రాబోతోందని తెలియజేశారు. ప్రస్తుతం RRR సినిమా ఆస్కార్ ప్రచారభరిలో ఉన్న రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కథ పైన సీరియస్ గా పని చేస్తున్నారని తెలియజేశారు. మరొకసారి విప్లవ వీరులు ఇందులో వస్తారని తెలియజేసినట్లు సమాచారం.

మూడు గంటల నిడివి ఉన్న RRR చిత్రం ఇటీవల రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను సంపాదించింది.ముఖ్యంగా నాటు నాటు ట్రాక్ కోసం ఒరిజినల్ సాంగు తో పాటు ఉత్తమ ఆంగ్లేతర భాష చిత్రంగా రికార్డుకు కెక్కింది. అలాగే న్యూ ఇయర్ ఫిలిం క్రిటిక్ సర్కిల్లో కూడా రాజమౌళి ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్నారు. ఈ విజయాలతో రాజమౌళి ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. ఈ ఉత్సాహంతోనే ఈ సినిమా సీక్వెల్న తెరకెక్కించాలని తెలియజేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రాజమౌళి, మహేష్ బాబుతో తన 29వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే తెరకెక్కిస్తారేమో చూడాలి.