హీరోల పారితోషికంపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి సంబందించిన విషయం కూడా వివాదాలకు దారితీసింది.

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన సినిమా అంటే ఎలాంటి హంగు ఆర్భాటం కాంట్రవర్సీలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్‌ ఎందుకునేవి. అలాంటిది ఇప్పుడు ఆయన ఏం చేసిన కూడా అది పెద్ద వివాదం గా మారుతుంది. వచ్చే ఏడాది సంక్రాతి పండుగ సందర్బంగా వాల్తేరు వీరయ్య, వీర సింహరెడ్డి సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇదే సమయంలో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమా కూడా విడుదల చేయనున్నారు.

ఇక ఈ విషయం కూడా పెద్ద వివాదంగా మారింది. దిల్ రాజు ఆయన నిర్మించిన సినిమాను ఆయనే రిలీజ్ చేసుకుంటున్నారు, దీని గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం చేయొద్దని అంటున్నారు. ఇది ఇలా ఉండగా దిల్ రాజు తాజాగా హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి స్పందించారు. “ఇటీవలే కొంతమంది నిర్మాతలు హీరోలకి కావాలనే రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాము. అంతేకాకుండా హీరోలు నిర్మాతలను మాకు అంత కావాలి ఇంత కావాలి అని డిమాండ్ చేస్తున్నారు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు” అని దిల్ రాజు చెప్తున్నారు.

నిర్మాతలు ఏమంత పిచ్చివాళ్లు కాదు, హీరో మార్కెట్, బడ్జెట్, లెక్కలు వసూలు అన్ని అంచనా వేసిన తరువాతనె రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారు. ఏదో వారు ఆడుతున్నారని ఎంత పడితే అంత ఇవ్వరు అని ఆయన వివరించారు. అలానే ఇండస్ట్రీలో నిర్మాత్తగా రానించాలి అంటే అగ్ర కులం అయ్యి ఉండాలనే విషయం గురించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. తను రెడ్డి అయినప్పటికీ ఇండస్ట్రీలోకి జీరోతో ఇన్‌కమ్‌తో అడుగుపెట్టాను అని చెప్పారు.