పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవగా ఇప్పుడు రెండో సీజన్ కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 6 ఎపిసోడ్ కు సంబంధించి ఈ షోకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్లుగా వచ్చారు.
ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదల చేయగా తాజాగా నిన్న రాత్రి ఈ షోకు ప్రోమో విడుదల చేయడంతో ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ- ప్రభాస్ మధ్య వచ్చే సంభాషణలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఈ ప్రోమోలో ప్రభాస్ పెళ్లి విషయాలు కూడా చెప్పడంతో పాటు. రామ్ చరణ్- ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పడంతో గోపీచంద్- ప్రభాస్ పెళ్లి గురించి ఆట పట్టించడం ఇవన్నీ చూస్తుంటే ఈ షో అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఈ ప్రోమోలో భాగంగా ప్రభాస్ పెదనాన్న దివంగత నటుడు కృష్ణంరాజుకి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు స్పెషల్ ఏవిని అక్కడ ప్రదర్శించారు. ఆ తరవాత ఆయన గురించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.. ఆ తర్వాత ప్రభాస్ తన పెదనాన్నకృష్ణంరాజు చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నాడు.. అక్కడ ప్రభాస్ ని అలా చూడడంతో ఒక్కసారిగా షో మొత్తం నిశ్శబ్ద వాతావరణం సంతరించింది.
తన పెదనాన్న గురించి ప్రభాస్ మాట్లాడుతూ పెదనాన్న తనకి ఎప్పుడూ ఒకటే చెప్పేవారని, శత్రువు మన ఇంటికి వచ్చిన మర్యాదలు ఇవ్వాలి , కోపతాపాలని బయట చూసుకోవాలని పెదనాన్నగారు తనకు ఎప్పుడూ చెప్పేవారిని ఆ మాటలను ప్రభాస్ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. పెదనాన్న అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ తెలిపాడు. కృష్ణంరాజు 22 సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన ఆహాలు స్ట్రీమింగ్ ఈ ప్రోమోలో తెలిపారు. ఈ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది.