థియేటర్ ఓనర్స్‌కి నయనతార భర్త విజ్ఞప్తి.. ఎందుకంటే…

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విగ్నేష్ శివన్ ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతారని వివాహం చేసుకోవడంతో ఈయన పేరు ఇంకా ఎక్కువగా వినబడుతోంది. విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్ బ్యానర్‌పై సొంతగా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే విగ్నేష్ శివన్ నిర్మించిన హార్రర్ మూవీ ‘కనెక్ట్’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ హారర్ మూవీలో నయనతార హీరోయిన్‌గా చేసింది. ‘కనెక్ట్’ సినిమాని డిసెంబర్ 22న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ థియేటర్స్ యజమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు. అదేంటంటే తన కనెక్ట్ మూవీ థియేటర్లలో ప్లే చేస్తున్నప్పుడు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా కొనసాగించాలని థియేటర్ ఓనర్స్ ని కోరుతున్నాడు. అంటే సినిమాకి మధ్యలో ఇంటర్వెల్ ఉండొద్దని విగ్నేష్ అంటున్నాడు. ఎందుకంటే కనెక్ట్ సినిమా బ్రేక్ లెస్ మూవీ గా తీసుకురావాలని అనుకుంటున్నాడు. విగ్నేష్ శివన్ కనెక్ట్ మూవీ దెయ్యాల కథతో వస్తుంది. హారర్ సినిమా కావడంతో మధ్యలో బ్రేక్ ఇస్తే ప్రేక్షకులకు ఆ హారర్ ఫీల్ అనేది పోతుందని విగ్నేష్ భయపడుతున్నాడు. అందుకే కంటిన్యూగా ఈ మూవీ ప్లే చేయాలని కోరుతున్నాడు.

కేవలం 99 నిముషాలు మాత్రమే ఈ మూవీ రన్ టైం ఉంటుందట. ప్రేక్షకులకు హారర్ ఫీల్ తీసుకురావడానికి విగ్నేష్ శివన్ బాగానే ప్రయత్నిస్తున్నారు కానీ థియేటర్ యాజమాన్యం దానికి ఒప్పుకుంటుందో లేదో అనేది మాత్రం వేచి చూడాలి.