పారితోషికంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్‌.. ఆ పొగ‌రే ఆఫ‌ర్లు రాకుండా చేస్తుందా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` సినిమాతో మృణాల్‌ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా తర్వాత మృణాల్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ సీతారామం విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా.. మృణాల్‌ నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ కూడా రాలేదు. అయితే ఇందుకు ఆమె రెమ్యునరేషన్ ను అధికంగా డిమాండ్ చేయడమే కారణమంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు తాజాగా మృణాల్ పారితోషకం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

`ప్రేక్షకుల్లో మ‌న‌కున్న ఇమేజ్‌ను బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్లు తాము కోరుకున్న రెమ్యున‌రేష‌న్ డిమాండ్‌ చేసే విషయంలో సంకోచిస్తుంటారు. అది మంచిది కాదు. రెమ్యునరేషన్‌ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. రెమ్యునరేషన్స్‌ విషయంలో హీరోయిన్స్‌ నిక్కచ్చిగా వ్యవహరించాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థమవుతుంది` అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్ విష‌యంలో మృణాల్ ను కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అంత పొగ‌రు చూపించ‌డం వ‌ల్లే నీకు ఆఫ‌ర్లు రావ‌డం లేదంటూ మృణాల్ కు చుర‌క‌లు వేస్తున్నారు.