సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కీర్తి సురేష్..ఎంత సంపాదించిందో తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లొ మహానటి కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందాల కుందనపు బొమ్మ చీరకట్టి పద్ధతిగా ఆఫర్స్ దక్కించుకున్న రియల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకే ..రీసెంట్గా మహేష్ బాబుతో నటించిన సర్కారీ వారి పాట సినిమాలో మాత్రం అమ్మడు మోడ్రెన్ బార్బీ బొమ్మగా తయారైంది . ఆ సినిమాలో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిందో అందరికీ తెలిసిందే.

అప్పటివరకు కీర్తి పద్ధతి రోల్స్ చేస్తుంది మహాలక్ష్మి అన్న జనాలు అందరూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని మోడ్రన్ మహాలక్ష్మి అంటూ కవర్ చేసుకున్నారు. కాగా ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఆస్తి డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అప్పుడెప్పుడో 2013లో గీతాంజలి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ..నిన్నకాక మొన్న వచ్చిన సర్కారి వారి పాట సినిమా వరకు తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

కాగా కీర్తి ప్రజెంట్ ఒక్కో సినిమాకి దాదాపు రెండు నుండి మూడు కోట్లకు పైగా నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 70 నుండి 80 కోట్ల వరకు కూడా పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాదు ఆమెకు వంశానుసారంగా వచ్చే ఆస్తి , ఇల్లులు కూడా ఉన్నాయట. అవి కాకుండా కీర్తి దగ్గర మూడు బ్రాండెడ్ కార్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్లి కోసమని కీర్తి అమ్మగారు బోలెడు బంగారు నగలు చేయ్యించి పెట్టిందట. ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ చాలా సింపుల్ గా కనిపిస్తూనే ఈ రేంజ్ లో ఆస్తులు వెనకేసిందా అంటూ షాక్ అయిపోతున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాల్లో నటించి ఇంకెన్ని కోట్ల ఆస్తి కూడబెడుతుందో ఈ మహానటి..?