నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన జై బాలయ్య, సుగుణసుందరి పాటలుకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వీర సింహా రెడ్డి లోని ఐటెం సాంగ్ ను బయటకు వదలారు. `మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి` అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి.
రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్లు ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. తమన్ తన మాస్ బీట్స్ తో అదరగొడితే.. చంద్రికా రవి, హనీ రోజ్లతో కలిసి బాలయ్య తన మాస్ స్టెప్పులతో పిచ్చెక్కించారు. మొత్తానికి మా బావ మనోభావాలు అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండింగ్లోకి వచ్చేసింది.