అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముందుగా బాలనటిగా చిత్ర పరిశ్రమంలో తన కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత తన 16 సంవత్సరాల వయసులో రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటిగ గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. శ్రీదేవి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా నటించి తన నటనతో భారతదేశంలో ఉన్న సినీ ప్రేక్షకులను మెప్పించింది. 1980, 90వ దశకంలో శ్రీదేవి అంటే ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు.. శ్రీదేవి తమతో మాట్లాడితే చాలని.. ఆమెను కలుసుకోవడానికి ఎంత పనైనా చేయడానికి ఆమె అభిమానులు ప్రయత్నించేవారు.
అలా దుబాయ్ కి చెందిన ఓ సేట్ శ్రీదేవి కోసం ఆమె మాట్లాడితే ఆమెకు రూ.200 వందల కోట్లు ఇచ్చేస్తానంటూ.. ఆమె కోసం రూ.1000 కోట్ల విలువచేసే ఓ ప్యాలెస్ ఆమె కోసం ప్రత్యేకంగా కొన్ని ఆ పేపర్స్ కూడా ఆమె చేతికే ఇచ్చాడు. అంతలా అభిమానులు ఆమెను ఎంతో ఆరాధించేవారు.. మరికొందరు ఆమెను దేవతల పూజించేవారు. సినిమాలలో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తో వచ్చాన తర్వాత శ్రీదేవి కోసం దర్శక నిర్మాతలు కూడా కళ్ళు కాయలు కాసే దాకా ఎదురుచూసేవారు.
ఆ రోజుల్లో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ వంటి హీరోలతో నటించి అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ను వివాహం చేసుకొని జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం జాన్వీ కపూర్బాలీవుడ్ లో స్టార్ హీరోయిగా కొనసాగుతుంది. శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె అభిమానుల గుండ్లెలో ఎప్పుడు ఉంటుంది.