బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి లాగారు.

అలాగే అధికార బలంతో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇలా వైసీపీ హవా నడవడంతో బాబు కూడా అలెర్ట్ అయ్యారు..వీలు కుదిరినప్పుడల్లా కుప్పంకు వెళ్ళి..అక్కడ పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. తన కంచుకోట చేజారి పోకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే కుప్పంలో బాబు పర్యటించారు. తాజాగా మరోసారి కుప్పంలో పర్యటించడానికి బాబు రెడీ అయ్యారు.

జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పంలో బాబు పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. 4న బెంగళూరు నుంచి శాంతిపురం మండలం చెంగుబల్లకు చేరుకుంటారన్నారు. చెంగుబల్ల, 121-పెద్దూరు, కెనమాకులపల్లెల్లో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 5, 6 తేదీల్లో రామకుప్పం, కుప్పం, గుడుపల్లెల్లో చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ పూర్తి కాలేదన్నారు.

అంటే మరోసారి బాబు కుప్పంకు వెళ్ళి..తాను కుప్పంలో ఉంటాననే భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే వైసీపీ దెబ్బక్కు అక్కడ ఇల్లు కూడా కట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటు నెక్స్ట్ కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. మరి చూడాలి ఈ సారి కుప్పం రాజకీయాలు ఎలా ఉంటాయో.