పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహానికి ప్రాణమిస్తారని అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా టైం నుంచి ఆలీతో పవన్ కు మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ ఆలీతో ఇప్పటికీ కూడా తన బంధాన్ని కొనసాగిస్తూ రాజకీయాల వలన ఎలాంటి గొడవలు రాకూడదని పవన్, ఆలీకి దూరంగా ఉన్నాడు. వీరితో పాటు త్రివిక్రమ్, పవన్ స్నేహం గురించి కూడా అందరికీ తెలిసిందే.
త్రివిక్రమ్, పవన్ స్నేహం వీరందరి కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. అయితే వీరితో పాటు పవన్ స్నేహితుడు ఇంకొకరు ఉన్నారు. అతను మరెవరో కాదు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్ వేసి అందరి దగ్గర నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఆనంద్ సాయి..ఆ తర్వాత తొలిప్రేమలో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకిని వివాహం చేసుకున్నాడు.
ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు పవన్, ఆనంద్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఆనంద్.. పవన్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ పవన్ ఎంతో చనువుగా ఆనంద్ మీద చేయి వేసి మాట్లాడుతున్న వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆనంద్. 25 సంవత్సరాల క్రితం వీరి స్నేహబంధం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఇక దీంతో అభిమానులు అప్పటి ఫోటోలను ఇప్పటి ఫోటోలను జతచేసి ఇది రియల్ ఫ్రెండ్షిప్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.