రకుల్ టాలీవుడ్ లో నటించకపోవటానికి కారణం అదేనా..ఓపెనా గా చెప్పేసిందిగా..!!

సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తమిళ్- తెలుగు ఇతర భాషల సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో ఏకంగా 12 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. ఈమె టాలీవుడ్ లో ఎంటర్ అయిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ రాణిస్తుంది.

 

టాలీవుడ్ లో 2021 లో వచ్చిన కొండ పాలేం సినిమా తర్వాత.. ఈమె తెలుగులో కనిపించలేదు. ఈ సినిమా తర్వాత ఈమె పూర్తిగా బాలీవుడ్ కి తన మకం మార్చేసింది. అక్కడ వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఈమె తమళ్ లో కమలహాసన్ తో భారతీయుడు2 సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు రకుల్ తెలుగు సినిమాలలో ఎందుకు నటించడం లేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రకుల్ టాలీవుడ్ లో ఇక సినిమాలు చేయదు అని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా రకుల్ ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈమె బాలీవుడ్‌లో నటించిన డాక్టర్ జీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ తాను టాలీవుడ్ లో ఎందుకు నటించటం లేదు అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది. “నన్ను చాలామంది సోషల్ మీడియా ద్వారా ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు.. టాలీవుడ్ లో సినిమాలు చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు.. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను టాలీవుడ్ లో నటించలేకపోతున్నాను… టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం టాలీవుడ్ వల్లే నేను ఇంత ఎత్తుకు ఎదగలిగాను.. నేను వచ్చే సంవత్సరం కచ్చితంగా టాలీవుడ్ లో నటిస్తానని ” రకుల్ తన మనసులో మాట బయట పెట్టింది. దీంతో తన‌ పై వచ్చే వార్తలకు రకుల్ చెక్ పెట్టింది.