గత సంవత్సరం డిసెంబర్2న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సంవత్సరం అదే రోజున మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో’బింబిసార తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్. తర్వాత తాను చేసే సినిమాలు గురించి పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి, కథ మీద నమ్మకంతో విడుదలకి కొద్ది రోజులు ముందుగా ప్రమోషన్లను చేసుకుని బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.
తాను చేసే ప్రతి సినిమాకు ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని ఈ నందమూరి హీరో భావిస్తున్నాడు. కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 19వ సినిమాని మైత్రి మూవీ బ్యానర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను రాజేందర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ‘ఎమిగోస్స అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దసుకు చేరుకుందని ప్రకటించి అందర్నీ షాక్ గురి చేశారు.
అంతేకాకుండా ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే గత సంవత్సరం ఆ తారీకున నందమూరి కుటుంబానికి అఖండ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హీట్ వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంటును కొనసాగిస్తూ ఈ ఏడాది డిసెంబర్ 2న కళ్యాణ్ రామ్ తన సినిమాను తీసుకొచ్చి అఖండ హిట్ను రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.