పూరి జగన్నాథ్ ని తెలుగు ఇండస్ట్రీ బాయ్ కాట్ చేయబోతోందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి అతి తక్కువ బడ్జెట్ తోనే ఎక్కువ లాభాలు వచ్చే సినిమాలను తెరకెక్కిస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో పూరితో సినిమా చేయాలంటే నటీనటులు సైతం భయపడుతున్నారు. ఇక తాజాగా లైగర్ సినిమా పాన్ ఇండియా లేవల్ లో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి విడుదల చేయగా ఈ సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యింది.

It's time for us to turn into a farmer: Puri Jagan - Video
దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లకు భారీ నష్టాన్ని చవిచూశారు. దీంతో కొంతమంది బయ్యర్ల సైతం తమకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూరి జగన్నాథ్ ఈ విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా పూరి జగన్నాథ్ రవితేజతో తెరకెక్కించిన నేనింతే సినిమాకి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో అప్పట్లో ఎంతో కొంత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పుడు ఉన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ల మీద పోలీస్ కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఇక సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ సినిమాకి ఫైనాన్స్ చేయకూడదని టాలీవుడ్ ఫైనాన్షియల్ సైతం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పూరి తెరకెక్కించే సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేయకుండ బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. నిజంగానే పూరి జగన్నాథ్ భాయ్ కాట్ చేయడం లేదా బ్యాన్ చేయడం అనేది చాలా రిస్క్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుచేత అంటే సినిమా అంటే కొన్ని కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం కాబట్టి..ఇందులో ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉంటారని టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.