బాలకృష్ణ సినిమాపై భారీ కుట్ర.. ఆ పెద్ద మనిషి కావాలనే అన్యాయం చేస్తున్నారా..!

గత సంవత్సరం బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో విడుదలై భారీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి టాలీవుడ్ మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ టైంలో సినిమా టికెట్‌ రేట్లను భారీగా తగ్గించింది గవర్నమెంట్. ఆ తగ్గించిన రెట్ల టైంలోనే ఈ సినిమా విడుదలై.. సెన్సేషనల్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా సుమారు 200 కోట్ల కలెక్షన్ రాబట్టి.. బాలకృష్ణ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో టాలీవుడ్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు చూసి తర్వాత ఇతర సినిమా హీరోలు వారి సినిమాని నమ్మకంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఇంతటి సంచలన రికార్డులు అందుకున్న అఖండ‌ సినిమాకి.. టాలీవుడ్ లో కొందరు పెద్దలు అన్యాయం చేస్తున్నారని బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం మొన్న జరిగిన సైమా అవార్డ్స్ లో మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ లో అఖండ సినిమాకి అవార్డులు రాకుండా టాలీవుడ్ లో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమా ఐదు కేటగిరీలో అవార్డులను సొంతం చేసుకునే అర్హత ఉంది… కానీ టాలీవుడ్ లో ఉన్న ఆ పెద్దలు ఈ సినిమాకి అవార్డులో రాకుండా చేశారంటూ బాలకృష్ణ అభిమ‌నులు సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు.