రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నటి హేమ కౌంటర్… భక్తి కోసమే వచ్చా లేదంటే!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియనివారు వుండరు. సినిమాల్లో నటిస్తూనే, అడపాదడపా కొన్ని సామాజిక అంశాలపట్ల పలు వేదికలపై మాట్లాడి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది హేమ. ఇక చాలా కాలం తరువాత ఆమె మరో సారి హాట్‌ టాపిక్‌ అయింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన హేమ మీడియాపై ఫైర్‌ అయ్యింది. తాను భక్తికోసం వచ్చాను, కాంట్రవర్శి కోసం కాదంటూ మీడియా వారికి చురకలు అంటించింది.

విషయం ఏమంటే, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా హేమ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకోవడానికి వెళ్లారు. దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది ప్రోటోకాల్‌ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటెత్తి వస్తున్నారని, దీంతో ఏడాది అమ్మవారిని దర్శించుకోవడం కుదురుతుందో లేదో అనుకున్నానని అని తెలిపింది. కానీ అమ్మవారు తనని ఇక్కడికి రప్పించారని, ఇక్కడ దర్శించుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు… అని అంది.

ఇంతలో ఓ రిపోర్టర్‌ ఓ ప్రశ్న అడుగుతూ… టికెట్‌ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీంతో చిర్రెత్తిపోయిన నటి హేమ అతనిపై సీరియస్ అయ్యింది. మేం ఇద్దరం వచ్చాం. హుందీలో పదివేలు వేశాను. అమ్మవారికి 20వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్‌ గురించి మాట్లాడుతున్నారు. ఫోటో కాల్‌ ప్రకారమే ఫాలో అయ్యాం. దీన్ని కాంట్రవర్శి చేయడం సరికాదు. తాను భక్తికోసం వచ్చాను. కాంట్రవర్సికోసం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాంతో సో కాల్డ్ రిపోర్టర్‌ నోరు మూసుకోవాల్సి వచ్చింది.