నట కిరీటి రాజేంద్రప్రసాద్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కామెడీ హీరోగా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని.. ఆ తర్వాత సీరియస్ పాత్రలలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి.. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
అయితే రాజేంద్రప్రసాద్ అన్నగారు నందమూరి తారకరామారావు గారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈయన కెరియర్ ప్రారంభంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకున్నప్పటికీ తదనంతరం బాపు దర్శకత్వంలో తెరకెక్కిన `స్నేహం` అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయన తన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును పొందారు.ప్రస్తుతానికి ఈయన యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈయన కెరీర్లో అత్యధిక పారితోషకం ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు. రాజేంద్రప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి హీరోగా పేరుపొందిన తన కెరీర్లో అత్యధికంగా తీసుకున్న పారితోషకం కేవలం 35 లక్షలు మాత్రమే. అది కూడా హాలీవుడ్ సినిమా `క్విక్ గన్ మురుగన్` ఈయన కెరీర్ లో ఎంతో మంచి సక్సస్ ను అందుకుంది. ఇక ఈయన ఈ సినిమాకు గాను 35 లక్షల రూపాయలు రెమ్యూనేషన్ తీసుకున్నారట. అయితే రాజేంద్రప్రసాద్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సరే నిర్మాతలను మాత్రం ఎప్పుడూ రెమ్యూనేషన్ విషయంలో డిమాండ్ చేయలేదని తెలుస్తుంది.