ఇక చిరంజీవి పని అయిపోయినట్టేనా.. ఇదిగో ప్రూఫ్.!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈమధ్య విడుదలైన ఏ సినిమా కూడా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక చిరంజీవి పని అయిపోయినట్టే అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు అభిమానులు ఈ ఏడాది పోకిరి సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీమాస్టర్ చేయించి కనివిని ఎరుగని రేంజ్ లో 370 షోస్ వేసుకొని ప్రభంజనం సృష్టించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోస్ ద్వారా దాదాపుగా 1 కోటి 75 లక్షల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఇది ఒక ఆల్ టైం రికార్డ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు సృష్టించిన ఈ అరుదైన రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారు అని అనుకుంటున్న సమయంలోనే చిరంజీవి పుట్టినరోజు కూడా వచ్చింది.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఘరానా మొగుడు సినిమాను రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ షో వేసుకున్నారు చిరు అభిమానులు. అయితే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మరీ పాత సినిమా అవడంతో ఈ జనరేషన్ యూత్ ను పెద్దగా ఆకర్షించలేదని చెప్పవచ్చు. ప్రధాన ప్రాంతాలలో హౌస్ ఫుల్ అయితే పడ్డాయి.. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేదని చెప్పాలి.

ఘరానా మొగుడు సినిమా కేవలం 20 లక్షల రూపాయల గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త . ఇక దీన్ని బట్టి చూస్తే పోకిరి సినిమా మేనియాను ఘరానా మొగుడు కనీసం కూడా మ్యాచ్ చేయలేకపోవడం బాధాకరమని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం పోకిరి సినిమాను బీట్ చేయగల సత్తా ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని సెప్టెంబర్ రెండో తేదీన జల్సా సినిమా స్పెషల్ షోస్ ద్వారా పోకిరి సినిమా రికార్డ్స్ బద్దలు కొడదాం అని కూడా పవర్ స్టార్ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమాల పని అయిపోయినట్టే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.