జపాన్ భరతం పట్టేందుకు రెడీ అయిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.

ఫలితంగా ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో తారక్ విధ్వంసకర పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ రికార్డును క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇండియన్ సినిమాలంటే ఇష్టపడే జపాన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ఆర్ఆర్ఆర్ సిద్ధమయ్యింది. ఈ సినిమాను జపాన్‌లో అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా వెల్లడించింది. దీంతో జపాన్‌లో అప్పుడే ఆర్ఆర్ఆర్ సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ ఈ సినిమాను రిలీజ్ చేయకపోవడంతో జపాన్ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు తాజా ప్రకటనతో జపాన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.