రాజమౌళితో మహేశ్ సినిమా..సూపర్ స్టార్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడటానికి ఎంత సాఫ్ట్ గా ఉంటారో..అంతే సాఫ్ట్ గా అన్ని పనులు డీల్ చేస్తుంటారు. తన పని తాను చూసుకుని వెళ్లిపోయే మహేశ్ బాబు అంటే అమ్మాయిలకు అదో రకమైన పిచ్చి. పెళ్ళై..పిలల్లు ఉన్నా కానీ..గర్ల్స్, మహేశ్ అంటే పడి చచ్చిపోతారు..అలాంటి క్రేజీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ఈ ఘట్టమనేని వారసుడు.

 

రీసెంట్ గా ఆయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమే చూశాం. కేవలం 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ..దాదాపు 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ..భారీ బడ్జెట్ తో సినిమాలో హీరోలు గా చేస్తున్న బిగ్ స్టార్స్ సినిమాలు కోట్లకి కోట్లు నష్టాలు తెస్తున్న టైంలో..మహేశ్ బాబు సాధించిన ఈ రికార్డ్ కలెక్షన్స్ ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చాయి.

కాగా, ప్రజెంట్ త్రివిక్రమ్ తో ఓ మూవీ కి కమిట్ అయిన ఈ హీరో..ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తి అయిపోయాయి. ఫైనల్ టచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ ని వాడబోతున్నారట. అయితే, ఈ సినిమా కోసం మహేశ్ బాబు కెరీర్ లోనే ఫస్ట్ టైం..రికార్డ్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

సుమారు ఈ సినిమా కోసం మహేష్ 80 కోట్లు పారితోషకంగా పుచ్చుకోబోతున్నారట. ఈ చిత్రాన్ని జక్కన్న పూర్తిగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడని సమాచారం. బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో ఈసారి రాజమౌళి మరో విజువల్ వండర్ ను తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది.