ఆ ఒక్క మార్పు చేసుంటే “సర్కారువారిపాట”..కలెక్షన్స్ మరో 100 కోట్లు కలెక్ట్ చేసేదట..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లెటేస్ట్ గా హీరో గా నటించిన సినిమా “సర్కారువారిపాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమా మే 12న ధియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాని నమోదు చేసింది. అంతేకాదు నిర్మాతలకు కాసులు వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించడం ఒక్క ప్లస్ పాయింట్ అయితే..ఈ సినిమాలో కీర్తి హద్దులు చెరిపేస్తూ ఎక్స్ పోజింగ్ చేయడం..నాభి అందాలు చూయిస్తూ..మాస్ డ్యాన్స్ చేయడం మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది.

ఈ సినిమా లో మహేశ్‌ లుక్స్ కు మంచి పాజిటీవ్ కామెంట్స్ వినిపించాయి. చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు.. కామెడీ జోనర్ లో మహేశ్ యాక్టింగ్ స్టైల్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఓ వైపు యాక్షన్‌ సీన్స్ ..మరో వైపు కీర్తి హాట్ అందాలు..వీటితో పాటు అదిరిపోయే మాస్ స్టెప్పులు..ఇలా అన్నీ సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి..బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.

అయితే, తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ..తన అభిప్రాయన్ని వెల్లడించారు. మనకు తెలిసిందే ‘పరుచూరి పాఠాలు’ అనే పేరుతో ఈయన కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తూ..సినిమాల్లో తప్పు ఒప్పులను హిట్, ఫ్లాప్ అవ్వడానికి కారణాలను చెప్పుతుంటారు. కాగా, ఈ సినిమా గురించి అన్ని పాజిటీవ్ గానే చెప్పుకొచ్చిన ఆయన..సినిమాలో కీర్తి-మహేశ్ ల మధ్య ఇంకొన్ని కామెడీ..సీన్స్ పెంచుంటే బాగుండు అని..అభిప్రాయపడ్డారు.

సరదాగా, అల్లరి గా సాగిపోతూ అభిమానులు స్టోరీకి కనెక్ట్ అయ్యే టైం లోనే.. మహేశ్‌ ఇండియాకి తిరిగి రావడం…కొంచెం డిసప్పాయింట్ కలిగించే విషయమని..అక్కడే స్టోరీ కొంచెం దెబ్బతిందని చెప్పుకొచ్చారు. అలా కాకుండా హీరోతో పాటు హీరోయిన్‌ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు వచ్చేలా కధను రాసుంటే..అటోమెటిక్ గా కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్‌ సీన్స్‌ యాడ్‌ అయ్యేవని..అప్పుడు సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్‌ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు.