ఆచార్య.. ఏక్కడో తేడా కొడుతోంది శీనా!

ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే పేరుతో మార్మోగిపోతుంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆచార్య సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర విశ్లేషకులు.

అయితే ఇదంతా బాగానే ఉంది.. కానీ ఒకవేళ ఈ సినిమాకు తొలిరోజున మిక్సిడ్ టాక్ వచ్చినా.. నెగెటివ్ టాక్ వచ్చినా పరిస్థితి ఏమిటీ.. ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలు ఇప్పటివరకు ఎక్కవగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలుగానే ఉన్నాయి. ఆయన చేసిన సినిమాలు యంగ్ హీరోలతోనే ఉండటంతో వారి అభిమానులకు అవి నచ్చాయి.

కానీ మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో కొరటాల తెరకెక్కించే ఈ మూవీలో ఎలాంటి మెసేజ్ ఉంటుంది. పైగా ఎప్పుడో చప్పగా మారిన నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో కొంతమేర భయం ఉందనే చెప్పాలి. ఏదేమైనా ఈ సినిమా ట్రైలర్‌కు కూడా పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడంతో ‘ఎక్కడో తేడా కొడుతోంది శీనా’ అని అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి చూద్దాం.. ఏప్రిల్ 29న ఏం జరుగుతుందో.