Acharaya Pre Release: చరణ్ వేసిన ఆ ఘాటు పంచ్ ఎవరికబ్బా ..?

కొరటాల శివ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. పూజా హెగ్డే, కాజల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న సినిమా ను గ్రాండ్ గా ధియేటర్ లో రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. దీనికి సంబంధించి కొరటాల అన్ని పనులు పూర్తి చేసేశాడు. ఈ మధ్య ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అది మంచి సక్సెస్ అయ్యింది.

అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ స్టేజీ పై మాట్లాడుతున్నప్పుడు.. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లు కప్పి చరణ్ వైపు దూసుకు వచ్చి కాళ్ళ పై పడబోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని కట్టడి చేశారు. కానీ అప్పుడే చరణ్ ఓ డైలాగ్ కొట్టారు. ఇదంతా ఎవరు డిజైన్ చేశారు.. నా కోసం ఎవరు ఇలా ప్లాన్ చేశారు అని చరణ్ ఊహించని కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారికి ఏం అర్ధంకాలేదు. ఫైనల్ గా చరణ్ ఆ అభిమాని తో ఫోటో తీసుకుని పంపించారు.. సరే మ్యాటర్ కూల్ అయ్యిందని అనుకున్నారు.

కానీ అస్సలు మ్యాటర్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. చరణ్ ఆ పంచ్ విసింది..సో కాల్డ్ మెగా హీరోలని టార్గెట్ చేసిన ఓ భజన బ్యాచ్ కి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య చాలా ఆడియో ఫంక్షన్ల ల్లో ఇలా అభిమానులు హీరోల కాళ్ళు మొక్కడం ఫ్యాషన్ గా మారిపోయిందని.. ఇదంతా కావాలనే హీరోలు తమ పబ్లిసిటీ కోసం చేయించుకుంటున్నారని ఓ గ్యాంగ్ తెగ కామెంట్స్ చేస్తుంది. దానిలోను మరీ ముఖ్యంగా మెగా హీరోల పై రాళ్ళు విసురుతుంది. దీంతొ టైం చూసి చరణ్ అలాంటి వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ ఆ క్లిప్ ని వైరల్ చేస్తున్నారు. దీంతో చరణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.