కొట్టుకునేందుకు రెడీ అవుతున్న తారక్, చరణ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లుగా సావాసం చేశారు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీళ్లిద్దరు ఆన్‌స్క్రీన్‌పై కంటే కూడా ఆఫ్‌స్క్రీన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారని పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోనూ వీరిద్దరి స్నేహం చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వీరి స్నేహం మూడునాళ్ల ముచ్చటగా మారబోతుందట. త్వరలోనే వీరు ఒకరినొకరు కొట్టుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటో చూద్దామా.

ఆర్ఆర్ఆర్ సినిమా నుండి బయటపడ్డ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు తమ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తారక్ కూడా తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది చివరినాటికి పూర్తవుతాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఉగాది నాటికి రిలీజ్‌కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాయి. దీంతో వచ్చే మార్చిలో బాక్సాఫీస్ వద్ద తారక్, చరణ్‌లు కొట్టుకోవడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటివరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద యుద్ధం ప్రకటించనుండటంతో అభిమానులు తమ హీరో సినిమా హిట్ అంటే తమ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.