లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..ఆచార్య ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే..?

కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఉదయం నుండి ఆచార్య ట్రైలర్ కోసం ఎదురుచూస్తుంటే.. వాళ్ళని డిస్సపాయింట్ చేస్తూ..కొరటాల శివ ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 12న సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తాం అంటూ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయారు. ఎంత బాధపడుతున్నారంటే కొరటాలని బూతులు తిట్టేంతగా. సినిమా లేట్ చేయడమే కాకుండా..చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయాల్సిందట. ముందు నుండే అలానే ప్లాన్ చేసుకుంటూ వచ్చారట. కానీ ఈ మధ్య నే నీహారిక పబ్ లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు మీడియా అంతా కూడా అదే న్యూస్ ని హాట్ గా చూయిస్తుంది. నీహారిక మామగారు సైతం ఆమె పై కోపంగా ఉన్నారని..ప్రజెంట్ నీహారిక చైతన్య ను వదిలి పుట్టింటికి వచ్చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో పెదనాన్న అన్న నటించిన సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగోదు అని.. అది నాగబాబు బాధపెట్టిన్నట్లు ఉంటుందని. పైగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ పై బ్యాడ్ ఒపీనియన్ తో ఉన్నారు అందరు నీహారిక ఇష్యూ వల్ల.

నిన్న రిలీజ్ అయిన నీహారిక అన్న వరుణ్ సినిమా కూడా ఆల్ మోస్ట్ దొబ్బిందనే టాక్ వినిపిస్తుంది. ఇలాంటి టైంలో ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆచార్యకి కూడా తిప్పలు తప్పవు అని గ్రహించి లాస్ట్ మినిట్ లో కొరటాల మనసు మార్చుకున్నాడట. అప్రిల్ 12 లోపు నీహారిక పబ్ రైడ్ ఇష్యూ కొంచెం సర్దుకుంటుంది . గని ఫ్లాప్ టాక్ కూడా మర్చిపోతారు. సో..అప్పుడు ఫ్రెష్ గా ట్రైలర్ చూయిద్దాం అనేది కొరటాల కన్నింగ్ ప్లాన్ అంటూ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ..మెగా ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.