ఏపీలో క్యాబినెట్ రేసు మొదలైంది…జగన్ ఎప్పుడైతే జూన్లో గాని జులైలో గాని మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో, అప్పటినుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు..పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎవరికి వారు జగన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది..ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగా ఉంది.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే..అయితే మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ మంత్రివర్గంలో మార్పులు జరిగితే..ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది…అటు ఎలాగో మేకపాటి సీటు ఖాళీగా ఉంది..దీంతో నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరికి క్యాబినెట్లో ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.
అయితే ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయనేది క్లారిటీ లేదు..కానీ మంత్రి పదవి కోసం మాత్రం చాలామంది ట్రై చేస్తున్నారు. మొదట సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి రేసులో ముందున్నారు..ఈయన మంత్రి పదవిపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు. ఇక మేకపాటి చనిపోవడంతో..ఆయన కుటుంబం నుంచి కూడా పదవి ఆశించే వారు ఉన్నారు.
ఎలాగో ఆత్మకూరులో మేకపాటి భార్య పోటీ చేస్తారని తెలుస్తోంది…ఒకవేళ ఆమెకు మంత్రి పదవి ఇస్తారా? లేక గౌతమ్ బాబాయ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటారేమో చూడాలి. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం క్యాబినెట్ రేసులో ఉన్నారు..ఒకవేళ ఎస్సీ కోటాలో పదవి ఇస్తారు అనుకుంటే..గూడూరు, సూళ్ళూరిపేట ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి చూడాలి చివరికి నెల్లూరులో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో…కాకానికి మాత్రం మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.