మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్. “రౌద్రం రణం రుధిరం” టైటిల్తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవరాల్ గా 14 భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్తో స్టార్ట్ అవుతోంది.
ఈ సినిమాకు రు. 500 కోట్ల బడ్జెట్ పెట్టగా… నాన్ థియేట్రికల్ ఆదాయమే రు. 225 కోట్లు వచ్చిందంటున్నారు. టాలీవుడ్లోనే ఇద్దరు క్రేజీ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీంగా నటిస్తుండడంతో పాటు బాహుబలి 2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 20 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి.
ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. గత డిసెంబర్ లో కంటే ఈసారి అధికంగా, వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు అయితే బల్క్ బుకింగ్స్ చేసేస్తున్నారు. కొన్ని చోట్ల షోలకు షోలే బుక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు ఫిగర్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా ప్రీమియర్స్ మరియు ప్రీ సేల్స్ కలిపి 1 మిలియన్ డాలర్స్ ని ఈ సినిమా ఇప్పటికే దాటేసిందట. ఇక సినిమా రిలీజ్ నాటికి ఈ సినిమా రికార్డుల హవా మామూలుగా ఉండేలా లేదు.