“ఎవడ్రా మనల్ని ఆపేది”..నెట్టింట దుమ్ము రేపుతున్న పవన్ మాటలు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుబాటి విలన్ గా నటించిన చిత్రం “భీమ్లా నాయక్”.సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో మాలయాళ ముద్దుగుమ్మలు నిత్యా మీనన్, సంయుక్త మీనాన్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ కి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా..వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాటలు త్రివిక్రమ్ అందించగా..మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేశాడు.

ఈ సినిమాకి సగం బలం పవన్ నటన ..రానా యాక్షన్ అయితే..మిగత సగం త్రివిక్రమ్ రాసిన డైలాగులు..తమన్ మ్యూజిక్. ఖచ్చితంగా ఈ సినిమా విజయంలో తమన్ మ్యూజిక్ కీలక రోల్ ప్లే చేసింది. పవన్ నడిచి వస్తుంటే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ధియేటర్స్ లో విజిల్స్ తో దద్దరిల్లింది. ముఖ్యంగా “లా లా భీమ్లా” పాట వచ్చిన్నప్పుడు అయితే జనాలు పూనాకాలు వచ్చిన్నట్లు ఊగిపోయారు.

ఇక కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వసూళు చేసిన ఈ సినిమా నుండి చిత్ర బృందం రీసెంట్ గా మరో ర్యాప్‌ సాంగ్‌ ను రిలీజ్ చేసింది. దీంతో అభిమానులో డబుల్ జోష్ నింపిన్నట్లైంది. ఈ పాటలో పవన్ కూడా కొన్ని మాస్ డైలాగ్స్ చెప్పడంతో ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఫుల్ బీట్ తో మాస్ లిరిక్స్ తో సాగిపోయే ఈ సాంగ్ లో ప్రతి పదం పవర్ ఫుల్ గా ఉంది అంటున్నారు అభిమానులు. ‘వచ్చాడు భీమ్లా…. గ్రానైట్‌ బాంబులా.. కల్లోలం చేస్తాడు చూసుకో’.. సాలా.. లాఠీతో చాలా.. ఉంటాది దూల…..షురూ చేసిండంటే.. కాళ్లు మొక్కాలా” అంటూ సాగే ఈ పాట మధ్యలో పవన్ గర్జిస్తూ “మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ” అంటూ ఓ డైలాగ్ చెప్పుతాడు . ప్రస్తుతం ఈ డైలాగ్ ను క్రాప్ చేసి ఆయన అభిమానులు నెట్టింట ఆ డైలాగ్ ని హైలెట్ చేస్తున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా సెటైర్ వేసేలా ఉన్న ఈ డైలాగ్ ను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ట్రేండింగ్ లో ఉంచారు. ఇక ఈ పాట వీడియోలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతోపాటు షూటింగ్ టైంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలను కూడా యాడ్ చేశారు. దీంతో ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ పాట ఎలా ఉందో మీరు ఓసారి చూసి చెప్పండి..!!